ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపులను విస్మరిస్తున్న జగన్‌

ABN, First Publish Date - 2021-10-25T05:28:47+05:30

కాపుల ఓట్లతోనే సీఎం అయిన జగన్‌ నేడు ఆ కాపులనే విస్మరిస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు యిర్రింకి సూర్యారావు, నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లినీడి బాబి అన్నారు.

సీఎంకు రాసిన పోస్టుకార్డులతో కాపు సంక్షేమ సేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు యిర్రింకి సూర్యారావు


ఆకివీడు, అక్టోబరు 24 : కాపుల ఓట్లతోనే సీఎం అయిన జగన్‌ నేడు ఆ కాపులనే విస్మరిస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు యిర్రింకి సూర్యారావు, నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లినీడి బాబి అన్నారు.  స్థానిక సంగీత థియేటర్‌ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కాపు సంక్షేమ సేన ఉండి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ అధికారం చేపట్టిన తరువాత కాపులను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం కాపులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఏడాదిలో కాపు సంక్షేమానికి రూ.2 వేల కోట్లు అన్న జగన్‌ నేటికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాపులను బీసీలో చేర్చాలన్నారు. కాపుల పోస్టు కార్డుల ఉద్యమంపై సీఎం జగన్‌ స్పందించకపోతే మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు కొటికలపూడి తాతాజీ, చిరంజీవి సత్యనారాయణ, కుచ్చు శివరామకృష్ణ, తోట నాగబాబు, వలవల శేషు, కందుల అప్పారావు, గవర అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising