తెలంగాణ రాష్ట్రాన్ని చూసి జగన్ పరిపాలన నేర్చుకోవాలి: Harsha kumar
ABN, First Publish Date - 2021-09-17T19:04:06+05:30
ఏపీలో దిశ చట్టం అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఏపీలో అత్యాచార సంఘటనలపై ఎందుకు న్యాయం చేయటం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు.
రాజమండ్రి: ఏపీలో దిశ చట్టం అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అత్యాచార సంఘటనలపై ఎందుకు న్యాయం చేయటం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. ఏపీలో జరిగిన అత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి జగన్ పరిపాలన నేర్చుకోవాలని హితవుపలికారు. అత్యాచారానికి గురైన వారిని జగన్ పరామర్శించకపోవటం సిగ్గు చేటని హర్షకుమార్ అన్నారు.
Updated Date - 2021-09-17T19:04:06+05:30 IST