Nara Lokesh ను అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య.. : పీతల సుజాత
ABN, First Publish Date - 2021-09-09T20:28:57+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని జగన్ సర్కార్ తీరుపై
అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని జగన్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రక్షించలేని చేతకాని వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించమని పోరాడుతున్న లోకేష్ను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిల్లిలా తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుని.. పులిలా ప్రజల తరుపున పోరాడుతున్న లోకేష్ గారిని పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డుకుంటున్నారు. పోలీసులు లేకపోతే జగన్ మొదలుకుని వైసీపీ నాయకుల వరకు ఒక్కరూ కూడా ప్రజల్లో తిరగలేరు. లోకేష్కు వస్తున్న ప్రజాధరణ చూడలేక ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోంది’ అని సుజాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్రంగా ఖండిస్తున్నా..
‘వైసీపీ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. మీ అధికార బలంతో లోకేష్ను ఈరోజు అడ్డుకోవచ్చు కానీ ఆయనకు అండగా రాష్ట్ర ప్రజలు ,70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంభాన్ని పరామర్శించడానికి వెళ్తున్న లోకేష్ను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే నారా లోకేష్ గారిని విడుదల చేసి పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని పీతల సుజాత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
లోకేశ్ పర్యటనపై టెన్షన్.. టెన్షన్..!రోడ్డుపై కూర్చొని ఆలపాటి రాజా ధర్నా...కోడెల నివాసం వద్ద పోలీసుల ఆంక్షలుఇక సామాన్యప్రజలకు రక్షణేది: అనితనారా లోకేశ్ను అడ్డుకోవడం దుర్మార్గం: జీవీ ఆంజనేయులుమేడికొండూరు ఘటనపై ఏం సమాధానం చెబుతారు?: బీదా రవిచంద్ర‘సజ్జల సభకు వర్తించని నిబంధనలు లోకేష్ పర్యటనకు వర్తిస్తాయా?’
ఇవి కూడా చదవండి
గుంటూరు : పోలీసుల అదుపులో నారా లోకేష్.. తీవ్ర ఉద్రిక్తతబిగ్ బ్రేకింగ్ : పోలీసుల అదుపులో Nara Lokesh
Updated Date - 2021-09-09T20:28:57+05:30 IST