ద్వారకా తిరుమలలో సాయంత్రం 5:30 వరకు స్వామి దర్శనం
ABN, First Publish Date - 2021-06-21T13:45:50+05:30
ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపునిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల దర్శనాల సమయాల్లో మార్పులు చేశారు.
ఏలూరు: ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపునిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల దర్శనాల సమయాల్లో మార్పులు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి దర్శనం సమయాల్లో మరోసారి మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతి ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో జి.వి. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2021-06-21T13:45:50+05:30 IST