ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వచ్చిందని ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-17T05:20:36+05:30

ఓ యువకుడికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకు గురై విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, ఏప్రిల్‌ 16 : ఓ యువకుడికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకు గురై విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగి మండలం ఎస్‌ఐ సుధీర్‌ తెలిపిన వివరాలివి.. నడిపల్లికి చెందిన ఓ యువకుడు గుంటూరు స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. రెండు రోజుల కిందట కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం రాత్రి స్వగ్రామానికి విచ్చేశాడు. శుక్రవారం ఉదయం సెల్‌ఫోన్‌కు కరోనా పాజిటివ్‌ సమాచారం వచ్చింది. ఆందోళనకు గురైన యువకుడు(26) ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ రాకపోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతని సెల్‌కు ఫోన్‌ చేశారు. ‘నాకు కరోనా వచ్చింది. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా. విజయరాయిలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నా’నని చెప్పాడు. అతనిని వెతుక్కుంటూ అక్కడకు వెళ్లిన కుటుంబసభ్యులకు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-04-17T05:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising