ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహస్య జీవోలు ఎన్ని?...ప్రజలకు నిజం చెప్పరా?: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-07-23T17:56:41+05:30

జగన్ అసమర్ధ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు:  జగన్ అసమర్ధ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని  పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జీతాలు కూడా ఇవ్వలేరని, అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. బుగ్గన రాజేంద్ర తన పేరు బొంకు రాజేంద్రగా మార్చుకుంటే బెటర్ అని యెద్దేవా చేశారు. రహస్య జీవోలు ఎన్ని ఉన్నాయి.? ప్రజలకు నిజం చెప్పరా..? అని ప్రశ్నించారు. పెట్రో ధరల్లో దాదాపు రూ.60ల సెస్ విధిస్తున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వం అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్నారు. చెత్త పైన కూడా పన్నులు పెంచే చెత్త ప్రభుత్వం, చెత్త నాయకత్వం అని విమర్శించారు. అప్పు కోసం మోదీ కాళ్లపైనా, ఎవరి కాళ్లపైన అయినా పడుతున్నారని అన్నారు. సెంటు భూమి ఇచ్చి, పేదలను బురద నీళ్ళల్లో ఇళ్లు కట్టుకోమనడం దౌర్భాగ్యమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఏపీ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తుందని శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2021-07-23T17:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising