నేతాజీ సేవలు స్ఫూర్తిదాయకం
ABN, First Publish Date - 2021-10-22T04:53:07+05:30
రెడ్డిగణపవరం పాఠశాలలో గురువారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుట్టాయగూడెం, అక్టోబరు 21: రెడ్డిగణపవరం పాఠశాలలో గురువారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు స్ఫూర్తిదాయకమని హెచ్ఎం కెఎస్ఆర్ఎస్వి శాస్ర్తి అన్నారు. నేతాజీ సేవలను విద్యార్ధులకు వివరించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులు కె.సుమలత, అమినా పాల్గొన్నారు.
చింతలపూడి: జడ్పీ బాలికల హైస్కూలులో ఇండియన్ నేషనల్ ఆర్మీ డే నిర్వహించారు. నేతాజీ సుబాష్చంద్రబోస్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ నాయకులు, ప్రజలు అప్పట్లో పోరాట పటిమను, చంద్రబోస్ ధైర్య సాహసాలను విద్యార్థులకు వివరించారు. బోస్ జీవిత చరిత్ర వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T04:53:07+05:30 IST