ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌పై అభినందనలు : కలెక్టర్‌ మిశ్రా

ABN, First Publish Date - 2021-06-22T07:21:08+05:30

జిల్లాలో ఆదివారం 1,65,939 మంది కి కొవిడ్‌ టీకా వేయడం ద్వారా దేశం లోని 730 జిల్లాలకంటే ముందు వరుసలో ఉందని, ఇందుకు కారణ మైన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందిని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం  1,65,939 మంది కి కొవిడ్‌ టీకా వేయడం ద్వారా దేశం లోని 730 జిల్లాలకంటే ముందు వరుసలో ఉందని, ఇందుకు కారణ మైన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందిని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన కొవిడ్‌, హౌసింగ్‌, ఉపాధిహామీ పథకాలపై వీడియో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఫోన్‌ చేసి అభినందించారని తెలిపారు. గృహ నిర్మాణాల ప్రారంభ ప్రక్రియ నిరంతరాయంగా ఇదే స్ఫూర్తితో కొనసాగాలన్నారు. ఉపాధి హామీలో పోలవరం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో కార్మికుల హాజరు శాతం తగ్గడంపై ఆయన ఎంపీడీవోలను వివరణ కోరారు. జేసీలు వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, సూరజ్‌ ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T07:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising