ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య

ABN, First Publish Date - 2021-10-20T04:56:09+05:30

భర్తపై వేడినీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడిన భార్యను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్యాయత్నం కేసు నమోదు.. అరెస్టు

ఏలూరు క్రైం, అక్టోబరు 19 : భర్తపై వేడినీళ్లు పోసి హత్యాయత్నానికి పాల్పడిన భార్యను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు కుమ్మరరేవు తాపీమేస్త్రి కాలనీ 10వ రోడ్డునకు చెందిన మాచెర్ల నాగేంద్ర రావుకు సంతానం కలగక పోవడంతో ముందుగా చేసుకున్న ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. మూడవ భార్యగా పద్మావతి (45)ను వివాహం చేసుకోగా వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బీటెక్‌ చదువుతున్నాడు. అతనికి ల్యాప్‌టాప్‌ కొనమని పద్మావతి కోరింది. అయితే నాగేంద్రరావు రెండో భార్యతో మళ్లీ సంబంధం కొనసాగిస్తున్నాడని తనకు ఉన్న ఆస్తిని ఆమెకే ఇస్తానంటూ పద్మావతితో చెబుతూ బెదిరిస్తున్నాడు.  దీంతో ఈనెల 14వ తేదీ రాత్రి గొడవ జరిగింది. 15వతేదీ ఉదయం నిద్ర పోతున్న నాగేంద్రరావుపై సలసల కాగే వేడి నీళ్లు తెచ్చి పోసింది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. భర్తపై వేడినీళ్లు పోసిన భార్యపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆమెను మంగళవారం ఏలూరు టూటౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌ ఆధ్వ ర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. ఆమెను జిల్లా జైలుకు తరలించారు. 


Updated Date - 2021-10-20T04:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising