ఆదివాసీ చట్టాలను పాఠ్యాంశాల్లో చేర్చండి
ABN, First Publish Date - 2021-08-04T04:33:19+05:30
ఆదివాసీ విద్యార్థుల కు గిరిజన చట్టాలు, జీవోలపై అవగాహన కల్పించడం కోసం వాటిని పాఠ్యంశాలుగా చేర్చాలని ఆదివాసీలు కోరుతున్నారు.
బుట్టాయగూడెం, ఆగస్టు 3: ఆదివాసీ విద్యార్థుల కు గిరిజన చట్టాలు, జీవోలపై అవగాహన కల్పించడం కోసం వాటిని పాఠ్యంశాలుగా చేర్చాలని ఆదివాసీలు కోరుతున్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అలివేరులో మంగళవారం ఆదివాసీ నవోత్సవాన్ని చిన్నారులు నిర్వహించారు. నడపాల అఖిల్ తేజ జెండాను అవిష్కరించాడు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, దోపిడీల వ్యతిరేకిస్తూ విద్యార్థి లోకం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో ప్రదీప్, రాజేష్, జయంతి, శ్రీజ, బేబి ప్రసన్న పాల్గొన్నారు.
Updated Date - 2021-08-04T04:33:19+05:30 IST