నూతన ఏడాదికి శుభస్వాగతం: లోకేష్
ABN, First Publish Date - 2022-01-01T02:36:33+05:30
2021 కరోనా కష్టాలు, వరదల కన్నీళ్లు మిగిల్చి వెళ్లిందని టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఆశయాల సాధనకి అవకాశాలు మోసుకొస్తున్న
అమరావతి: 2021 కరోనా కష్టాలు, వరదల కన్నీళ్లు మిగిల్చి వెళ్లిందని టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఆశయాల సాధనకి అవకాశాలు మోసుకొస్తున్న నూతన ఏడాదికి శుభస్వాగతం పలికారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నతస్థానాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నానని లోకేష్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ఆనందోత్సాహాలతో గడవాలని కోరుకున్నారు. ప్రతి ఇంటా సంతోషం, చిరునవ్వులు విరియాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
Updated Date - 2022-01-01T02:36:33+05:30 IST