మహిళలపై వలంటీర్ అసభ్య ప్రవర్తన
ABN, First Publish Date - 2021-07-02T03:08:09+05:30
ధర్మవరంలో మహిళలపై వలంటీర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన
అనంతపురం: ధర్మవరంలో మహిళలపై వలంటీర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన చోటుచేసుకుంది. ధర్మవరంలో వలంటీర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ డీఎస్పీకి మహిళలు ఫిర్యాదు చేసారు. 11వ వార్డు వలంటీర్గా పనిచేస్తున్న కొండా అనే వ్యక్తి తమను దూషించి దాడి చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్ కొండను ఎదిరించిన వారిని ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేస్తున్నారంటూ ఫిర్యాదులో మహిళలు పేర్కొన్నారు.
Updated Date - 2021-07-02T03:08:09+05:30 IST