ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-11-29T05:15:15+05:30

బైకును ఆటో ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఎస్‌.కోట మండలంలోని గోపాలపల్లి వంతెన వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌, నవంబరు 28: బైకును ఆటో ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఎస్‌.కోట మండలంలోని గోపాలపల్లి వంతెన వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన అనకాపల్లి ప్రవీణ్‌కుమార్‌(25) డిగ్రీ పూర్తిచేశాడు. రెండేళ్లగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలో ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన కొత్తవిషయాలు తెలుసుకునేందుకు ఆదివారం తన బైకుపై విజయనగరం వెళ్తున్నాడు. గోపాలపల్లి వంతెనపైకి వచ్చేసరికి, ఎదురుగా ఎస్‌.కోట నుంచి విజయనగరం వస్తున్న అయ్య న్నపేటకు చెందిన ఆటో ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌కు తలపై బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ఓ అక్క ఉంది.  చేతికి అందొచ్చిన కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రశన్నకుమార్‌ కేసు నమోదు చేశారు.

 

Updated Date - 2021-11-29T05:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising