AP: పెళ్లి ట్రాక్టర్ బోల్తా... 22 మందికి గాయాలు
ABN, First Publish Date - 2021-12-10T13:10:49+05:30
జిల్లాలోని బొండపల్లి మండలం చామలవలస సమీపంలో ఓ పెళ్లి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
విజయనగరం: జిల్లాలోని బొండపల్లి మండలం చామలవలస సమీపంలో ఓ పెళ్లి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా బొండపల్లి మండంలం కిండాం అగ్రహారంలో పెళ్లి చూసుకుని తిరుగు ప్రయాణంలో మెంటాడ మండలం చింతాడవలస వెల్తుండగా చామలవలస సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-10T13:10:49+05:30 IST