గిరిజన మహిళ ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-09-15T05:32:32+05:30
దొరజమ్ము గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెట్టంగి అమ్మాజీ (28) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
గుమ్మలక్ష్మీపురం: దొరజమ్ము గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెట్టంగి అమ్మాజీ (28) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అమ్మాజీ భర్త నారాయణ తరచూ మద్యం తాగి వచ్చి గొడవపడుతుండడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబీకులు హుటాహుటిన రేగిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రఽథమ చికిత్స అందించి కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎల్విన్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-15T05:32:32+05:30 IST