ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు చేయూత

ABN, First Publish Date - 2021-06-17T05:09:52+05:30

అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలతో పాటు పంటల సాగుకు సాయం అందేలా చూడాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. తన చాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత 1,016 మంది గిరిజనులకు సుమారు 1,928.87 ఎకరాలను ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల కింద పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1,016 మందికి పట్టాలు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 16: అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలతో పాటు పంటల సాగుకు సాయం అందేలా చూడాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. తన చాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత 1,016 మంది గిరిజనులకు సుమారు 1,928.87 ఎకరాలను ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల కింద పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనులకు కేవలం పట్టాలను పంపిణీ చేసి వదిలేయకుండా వివిధ ప్రభుత్వ పథకాల కింద ఉద్యాన, వ్యవసాయ పంటల సాగుకు సాయం అందించాలని చెప్పారు. ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ మాట్లాడుతూ ఈ విడతలో కొమరాడ మండలంలో 120 మంది గిరిజనులకు 317.68 ఎకరాలు, కురుపాంలో 485 మందికి 965.16 ఎకరాలు, పార్వతీపురంలో 171 మందికి 200.2 ఎకరాలు, పాచిపెంటలో 72 మందికి 69.85 ఎకరాలు, జీఎల్‌పురంలోని 168 మందికి 375.98 ఎకరాలపై సాగు హక్కు కల్పించామని, త్వరలో వీరికి పట్టాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో అటవీ అధికారి సచిన్‌ గుప్తా, పార్వతీపురం ఆర్‌డీవో ఎస్‌.వెంకటేశ్వర్లు తదితరలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-17T05:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising