ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-06-04T05:09:43+05:30

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి, మృతులకు రూ.పది లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఇఫ్టూ డిమాండ్‌ చేసింది.

కరపత్రం ఆవిష్కరిస్తున్న ఇఫ్టూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, జూన్‌ 3: కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి, మృతులకు రూ.పది లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఇఫ్టూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఇఫ్టూ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాన్ని ఆ సంఘం స్థానిక నాయకుడు పి.మల్లిక్‌ జరజాపుపేటలో గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను జాతీయం చేసి అందరికీ ఉచితంగా అందించాలని, ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని కొవిడ్‌కి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. ఇఫ్టూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్‌ 7 నుంచి 13 వరకు డిమాండ్లపై ప్రచార కార్యక్రమం, జూన్‌ 14 నుంచి ప్రజలు, కార్మికులనుంచి సంతకాల సేకరణ, జూన్‌ 21న సచివాలయాలు, తహసీల్దార్‌లకు వినతి పత్రాల సమర్పణ, 28న ధర్నాలు, జూలై 4న సీఎంకు సంతకాల పత్రాల అందజేత తదితర కార్యక్రమాలకు నిర్ణయించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు నామాల తిరుపతిరావు, మద్దిల రాము, కాళ్ల అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-04T05:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising