ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎన్‌ఎంను కొట్టినవ్యక్తిపై కేసు

ABN, First Publish Date - 2021-07-26T05:09:53+05:30

రామలింగపురం గ్రామ సచివాలయానికి చెందిన ఏఎన్‌ఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందినగుంపాన శ్రీనివాస రావుపై సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ వై.వీరజనార్దన్‌కు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొత్తవలస, జూలై 25: రామలింగపురం గ్రామ సచివాలయానికి చెందిన ఏఎన్‌ఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందినగుంపాన శ్రీనివాస రావుపై సీఐ బాలసూర్యారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ వై.వీరజనార్దన్‌కు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. రామలింగపురం గ్రామానికి చెందిన గుంపాన శ్రీనివాసరావు అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామ సచివాలయానికి వెళ్లి మహిళా పోలీసు గురించి అడగ్గా అక్కడే ఉన్న కొత్తవలసకు చెందిన గ్రామ సచివాలయ ఏఎన్‌ఎం పొన్నగంటి వరలక్ష్మి.. మహిళా పోలీసు భోజనం చేస్తోందని చెప్పారు. దీంతో తనపై దుర్బా షలాడడమే కాకుండా కొట్టినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఎన్‌ఎంను కొట్టే సమయంలో అడ్డుకున్న 104 సిబ్బందిని, అలాగే గ్రామానికి చెందినవిద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సిబ్బందిపైన శ్రీనివాసరావు దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. గతంలో కూడా ఈయనపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

 

Updated Date - 2021-07-26T05:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising