రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సురేంద్ర ఎంపిక
ABN, First Publish Date - 2021-01-25T05:31:50+05:30
విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన ఎస్.సురేంద్ర ఎంపికయ్యాడు.
నెల్లిమర్ల: విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు మండలంలోని సారిపల్లి గ్రామానికి చెందిన ఎస్.సురేంద్ర ఎంపికయ్యాడు. సురేంద్ర విజయనగరం జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈయన గతంలో కూడా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. సురేంద్రను గ్రామ పెద్దలు అభినందించారు.
Updated Date - 2021-01-25T05:31:50+05:30 IST