‘బాధిత కుటుంబాలను ఆదుకోండి’
ABN, First Publish Date - 2021-06-14T04:17:05+05:30
‘బాధిత కుటుంబాలను ఆదుకోండి’
కలెక్టరేట్, జూన్ 13 : కరోనాతో మృతి చెందిన నాలుగో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే బెనిఫిట్స్ ఇప్పించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బాఽధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆదివారం పట్టణంలోని నాలుగో తరగతి ఉద్యోగుల భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగో తరగతి ఉద్యోగులకు శానిటైజర్లు, మాస్క్లు ఇప్పించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు కంది లక్ష్మణరావు, సుందర అప్పల నర్సయ్య, రామలక్ష్మి, మువ్వల గంగాప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-06-14T04:17:05+05:30 IST