ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు ఢీకొని విద్యార్థిని మృతి

ABN, First Publish Date - 2021-02-27T05:29:45+05:30

ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై మరుపల్లి గ్రామంలోని ఓలమ్‌ కంపెనీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం, ఫిబ్రవరి 26: ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై మరుపల్లి గ్రామంలోని ఓలమ్‌ కంపెనీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. మెంటాడ మండలం జయితి గ్రామానికి చెందిన గెద్ద ఇందు (17) బొండపల్లి మండలంలోని ఓ ప్రైవేటు కళాశా లలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లి, తిరిగి  ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూడగా, అప్పటికే బస్సు వెళ్లిపోయింది. దీంతో వరసకు అన్నయ్య అయిన నెమలిపాటి చిన్నంనాయుడుతో బైకుపై స్వగ్రామం బయలుదేరింది. బైకు ఓలం కంపెనీ వద్దకు వచ్చేసరికి.. విజయనగరం నుంచి జయితి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇందును స్థానికుల సహాయంతో ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇందు మృతి చెందినట్టు వైద్యాధికారిణి సీతాస్రవంతి ధ్రువీకరించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Updated Date - 2021-02-27T05:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising