మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2021-05-15T04:52:05+05:30
అక్షయ తృతీయ సందర్భంగా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నెల్లిమర్ల, మే 14 : అక్షయ తృతీయ సందర్భంగా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామి వారికి ప్రాతఃకాలార్చన, బాలభోగం చేశారు. ఆ తర్వాత యాగశాలలో సుందర కాండ హవనం, ఆదిత్య హృదయ హవనం, సుదర్శన అష్టకం నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన, పుష్పాలతో అర్చన, మంగళాశాసనం కార్యక్రమాలు నిర్వహించారు. సహాయ కమిషనర్ ప్రసాదరావు, అర్చకులు సాయిరామాచార్యులు, కిరణ్, నరసింహాచార్యులు, పి.ప్రసాద్, పవన్కుమార్, రామ్గోపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2021-05-15T04:52:05+05:30 IST