ఆంజనేయుడికి పంచామృతాభిషేకం
ABN, First Publish Date - 2021-06-13T05:11:33+05:30
ఆంజనేయుడికి పంచామృతాభిషేకం
నెల్లిమర్ల : రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శనివారం ఆంజనేయునికి పంచామృతాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. సింధూరం, తమలపాకులతో అర్చనచేశారు. యాగశాలలో సుదర్శన హోమాన్ని ప్రఽధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో కిరణ్, ప్రసాద్, గొడవర్తి నరసింహాచార్యులు నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్చైర్మన్ సముద్రపు రామారావు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-13T05:11:33+05:30 IST