కొనసాగుతున్న మాన్సాస్ ఉద్యోగుల నిరసన
ABN, First Publish Date - 2021-07-26T03:50:30+05:30
తమకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోరుతూ మాన్సాస్ ఉద్యోగులు ఆదివారం కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన కొనసాగించారు.
విజయనగరం రూరల్, జూలై 25: తమకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోరుతూ మాన్సాస్ ఉద్యోగులు ఆదివారం కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన కొనసాగించారు. తాము విధులు నిర్వహిస్తున్నా, జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే రానున్న కాలంలో ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
Updated Date - 2021-07-26T03:50:30+05:30 IST