ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-03-09T05:56:42+05:30

దావాలపేట రైల్వేగేటు వద్ద రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం, మార్చి 8: దావాలపేట రైల్వేగేటు వద్ద రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఎస్‌.కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.వెంకటాపురం గ్రామానికి  చెందిన పెదిరెడ్ల సతీష్‌ (37) రైలు గేటు దాటుతుండగా బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళుతున్న గూడ్స్‌రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య చిట్టమ్మ, ఇద్దరు పిల్లలు జయ, సంతోష్‌ ఉన్నారు. సతీష్‌ గతంలో లారీ క్లీనర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు విరిగిపోయింది. దీంతో దివ్యాంగుడైన సతీష్‌ పట్టణంలో  హోటల్‌లో పనిచేస్తూ కుటంబ పోషణ సాగిస్తున్నాడు. అందిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.  శవ పంచనామా కోసం మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2021-03-09T05:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising