అధికారులను ఇబ్బంది పెడుతున్న వ్యక్తి అదుపులోకి..
ABN, First Publish Date - 2021-12-04T05:22:21+05:30
తానే ఎంపీపీని, ఎంపీడీవోను అని చెప్తూ కార్యాలయంలోని కుర్చీలు ఖాళీ చేయాలంటూ గత రెండు రోజులుగా అధికారులను ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
లక్కవరపుకోట: తానే ఎంపీపీని, ఎంపీడీవోను అని చెప్తూ కార్యాలయంలోని కుర్చీలు ఖాళీ చేయాలంటూ గత రెండు రోజులుగా అధికారులను ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోతంపేట గ్రామానికి చెందిన కారుకొండ అప్పలపాత్రుడు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ అధికారులపై పెత్తనం చెలా యించాడు. దీంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపు లోకి తీసుకున్నారు. ఎస్ఐ లక్ష్మణరావు సంబంధిత వ్యక్తిని విచారించగా అతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటువంటి పనులు చేస్తున్నట్టు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2021-12-04T05:22:21+05:30 IST