18 నుంచి కురుపాంలో లాక్డౌన్
ABN, First Publish Date - 2021-04-16T04:50:23+05:30
రుపాంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్కు ముందుకొచ్చారు. ఈ నెల 18 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకే షాపులు తెరిచేందుకు నిర్ణయించారు. మిగతా సమయాల్లో మూసివేయనున్నారు. గురువారం వ్యాపారులతో తహసీల్దారు ఉమామహేశ్వరరావు, ఎస్ఐ రవికుమార్లు వ్యాపారులతో సమావేశమయ్యారు.
కురుపాం: కురుపాంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్కు ముందుకొచ్చారు. ఈ నెల 18 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకే షాపులు తెరిచేందుకు నిర్ణయించారు. మిగతా సమయాల్లో మూసివేయనున్నారు. గురువారం వ్యాపారులతో తహసీల్దారు ఉమామహేశ్వరరావు, ఎస్ఐ రవికుమార్లు వ్యాపారులతో సమావేశమయ్యారు. మాస్కు ధరించని వారికి వస్తువులు విక్రయించకూడదని నిర్ణయించారు.కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు బరాటం గుంపస్వామేశ్వరరావు, కొత్తకోట సురేష్, ఉప సర్పంచ్ ఆదిల్, శెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
111111111111111111111111111111111111111111
Updated Date - 2021-04-16T04:50:23+05:30 IST