ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడులను చూస్తూ ఊరుకోం: నాగార్జున

ABN, First Publish Date - 2021-10-21T04:49:28+05:30

తమ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టంచేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ చీపురుపల్లిలో తలపెట్టిన బంద్‌లో పాల్గొనేందుకు బయలుదేరుతున్న ఆయనను పోలీసులు తన నివాసం వద్దనే అడ్డుకున్నారు.

చీపురుపల్లిలో నాగార్జునను ఎత్తుకెళ్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీపురుపల్లి, అక్టోబరు 20: తమ పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ గూండాలు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్పష్టంచేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ చీపురుపల్లిలో తలపెట్టిన బంద్‌లో పాల్గొనేందుకు బయలుదేరుతున్న ఆయనను  పోలీసులు తన నివాసం  వద్దనే అడ్డుకున్నారు. కాసేపటి తరువాత నాగార్జున వెనుకవైపు ఉన్న గోడ దూకి బంద్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు ఆయనను అడ్డుకొని... తిరిగి తన నివాసంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాగార్జున విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలు, నాయకులను లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులకు పాల్పడడం హేయమన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, పైల బలరాం, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-21T04:49:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising