కారును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-03-02T05:44:28+05:30
కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘట న మండల పరిధిలోని మర్రివలస గ్రామం వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
రామభద్రపురం, మార్చి 1: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘట న మండల పరిధిలోని మర్రివలస గ్రామం వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీనిపై ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం నుంచి బాడంగి వైపు వెళుతున్న కారును రాజాం నుంచి రామభద్రపురం వైపు వస్తున్న లారీ ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సీతానగరం గ్రామానికి చెందిన మిరియాల గౌరీపతి (38) తీవ్రంగా గాయపడ్డారు. బాడంగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతుడు గౌరీపతి బాడంగి వద్ద ఆర్ఎస్వీ కనస్ట్రక్షన్స్లో సీనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆ పనులు పరిశీ లించి వస్తుండగా ఈ దుర్గటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.
Updated Date - 2021-03-02T05:44:28+05:30 IST