ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-17T05:35:42+05:30

లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరోకరు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




మరొకరి పరిస్థితి విషమం

 సీతానగరం: లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరోకరు తీవ్రగాయాలతో చికిత్సపొందుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తామరఖండి గ్రామానికి చెందిన గంగునాయిని లక్ష్మణరావు (48), గంగునాయిని తిరుపతిలు శుక్రవారం ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తున్నారు. బగ్గందరవలస సమీపంలో వచ్చేసరికి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సచేసిన అనంతరం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ లక్ష్మణరావు మృతిచెందాడు. తిరుపతి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహంకాగా..కుమారుడు బీటెక్‌ చదువుతున్నాడు. ఈ ఘటనతో తామరఖండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-04-17T05:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising