ఇళ్ల స్థలాల పరిశీలన
ABN, First Publish Date - 2021-01-17T04:49:48+05:30
మండలంలోని ఇప్పలవలస, బుధరాయి వలస గ్రామాల్లోని పేదల ఇళ్ల స్థలాలను శనివారం విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ పరిశీలించారు.
మెరక ముడిదాం, జనవరి 16 : మండలంలోని ఇప్పలవలస, బుధరాయి వలస గ్రామాల్లోని పేదల ఇళ్ల స్థలాలను శనివారం విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ పరిశీలించారు. ఇప్పలవలసలో ఇళ్ల స్థలాలకు అనుకుని ఉన్న గెడ్డకు రిటర్నింగ్ వాల్ నిర్మించాల్సిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. సాధారణ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. గతంలోనే ఇళ్ల స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. తహసీల్దార్ బి.రత్నకుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-01-17T04:49:48+05:30 IST