ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లిమర్ల పాఠశాల ఘటనపై విచారణ

ABN, First Publish Date - 2021-04-21T05:19:39+05:30

నెల్లిమర్ల బాలికోన్నత పాఠశాలలో భవనం పై నుంచి పదో తరగతి బాలిక కింద పడి గాయపడిన సంఘటనపై విజయనగరం డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీ మంగళవారం విచారణ ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   బాలిక భవనంపై నుంచి దూకేసినట్లు ప్రాథమిక అంచనా 

 నెల్లిమర్ల, ఏప్రిల్‌ 20: నెల్లిమర్ల బాలికోన్నత పాఠశాలలో భవనం పై నుంచి పదో తరగతి బాలిక కింద పడి గాయపడిన సంఘటనపై విజయనగరం డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీ మంగళవారం విచారణ ప్రారంభించారు.  పాఠశాల హెచ్‌ఎం నారాయణరావు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. గాయపడిన బాలిక తండ్రితోనూ, ఆయనతో పాటు వచ్చిన టీడీపీ నాయకులు లెంక అప్పలనాయుడు, చందక పెంటంనాయుడులతో వేర్వేరుగా సమావేశమై వివరాలు రాబట్టారు. తమ కుమార్తెకు ఆరోగ్యపరంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఆదుకోవాలని బాలిక తండ్రి కోరారు. సంఘటనకుగల కారణాలపై ఆరా తీయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఆ బాలిక రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడలేదని, ఉద్దేశపూర్వకంగా దూకేసి ఉంటుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు భోగట్టా. బాధిత బాలిక సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి నేరుగా కింద పడడంతో వెన్నుపూస ఛిద్రమైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దాదాపు జీవితం అంతా ప్రభావం చూపే ఈ సంఘటనకు అసలు కారణాలు తెలుసుకునేందుకు అధికారులు లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.  

 

Updated Date - 2021-04-21T05:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising