అంగన్వాడీ కార్యకర్తపై విచారణ
ABN, First Publish Date - 2021-03-07T05:15:15+05:30
కొవ్వాడ అంగన్వాడీ కార్యకర్త పప్పల జ్యోతిపై సీడీపీవో ఆరుద్ర శనివారం విచారణ నిర్వహించారు.
పూసపాటిరేగ, మార్చి 6: కొవ్వాడ అంగన్వాడీ కార్యకర్త పప్పల జ్యోతిపై సీడీపీవో ఆరుద్ర శనివారం విచారణ నిర్వహించారు. గత ఏడాది మార్చి నెలలో సిమ్మల యోగేంద్ర అనే పిల్లాడ్ని కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీంతో సంబంధిత శాఖ పీడీ ఆదేశాల మేరకు సీడీపీవో శనివారం విచారణ చేపట్టారు. తన కుమారున్ని తట్లు తేలేటట్లు కొట్టిన అంగన్వా డీ కార్యకర్తపై గత ఏడాది మార్చి 29న అప్పటి ఎస్ఐకి ఫిర్యాదు అందజేశామని, అయినా పట్టించుకోలేదని పిల్లాడి తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయాను అడుగగా అంగన్వాడీ కార్యకర్త కర్రతో కొట్టినట్టు చెప్పారు. అయితే దీనిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు కానట్టు విచారణలో తేలిందని సీడీపీవో తెలిపారు. గతంలో స్థానిక మహిళాపోలీసు విచారణ చేపట్టగా అంగన్వాడీ కార్యకర్త దండించినట్టు తెలిసిందని ఆమె చెప్పారు.
Updated Date - 2021-03-07T05:15:15+05:30 IST