ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరల పెంపుపై వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-10-30T04:08:21+05:30

పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నగరంలో ఆటో డ్రైవర్లు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రతినిధులు రమణ, జగన్మోహన్‌లు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

తాడుకట్టి ఆటోను లాగుతూ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 దాసన్నపేట, అక్టోబరు 29: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నగరంలో ఆటో డ్రైవర్లు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రతినిధులు రమణ, జగన్మోహన్‌లు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పెట్రో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తరువాత మాటే మరిచిపోయాయని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం తగదన్నారు. తక్షణం ధరలు తగ్గించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కనకదుర్గా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు పాపారావు, రామనాయుడు, శ్రీను, భాస్కరరావు, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-30T04:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising