ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలపై వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-06-18T05:11:30+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపాయి. ద్విచక్ర వాహనాలను ఇక వినియోగించలేమని చెబుతూ వాటికి పిండ ప్రదానం చేశాయి.

బైక్‌కు పిండప్రదానం చేస్తున్న సీపీఐ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైకుకు పిండ ప్రదానం చేసిన సీపీఐ శ్రేణులు

విజయనగరం దాసన్నపేట, జూన్‌ 17: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపాయి. ద్విచక్ర వాహనాలను ఇక వినియోగించలేమని చెబుతూ వాటికి పిండ ప్రదానం చేశాయి. అంబేడ్కర్‌ జంక్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పెట్రో ధరలు పెంచి సామాన్యులపై భారం మోపడం తగదన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోయినా, పెట్రోలు, డీజిల్‌ ధరలు మాత్రం పెంచుకుంటూ వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


Updated Date - 2021-06-18T05:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising