రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
ABN, First Publish Date - 2021-03-09T05:57:29+05:30
అమటాంరాయవలస సమీప జాతీయ రహదారిపై సోమవారం చేపలకంచేరు పంచాయతీ ఎర్రముసలయ్యపాలెం గ్రామానికి చెందిన అమర ఎల్లయ్యమ్మ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైంది.
భోగాపురం, మార్చి 8: అమటాంరాయవలస సమీప జాతీయ రహదారిపై సోమవారం చేపలకంచేరు పంచాయతీ ఎర్రముసలయ్యపాలెం గ్రామానికి చెందిన అమర ఎల్లయ్యమ్మ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైంది. ఎల్లయ్యమ్మ భోగాపురం గ్రామం వచ్చేందుకు అమటాంరాయవలస సమీప జాతీయ రహదారి దాటుతుండగా శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో ఆమెకు చేయి, కాలు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న 108వాహనం అక్కడకు చేరుకొని టెక్నీషియన్ ఎం.సత్యనారాయణ, పైలెట్ ఎల్.చంద్రశేఖర్ ప్రథమ చికిత్స అందించి, విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదు.
Updated Date - 2021-03-09T05:57:29+05:30 IST