ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతాం

ABN, First Publish Date - 2021-01-13T05:19:04+05:30

తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వద్ద తెగేసి చెప్పారు. కొదమ నుంచి గిరిజనులు మంగళవారం ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చారు.

ఎమ్మెల్యే రాజన్నదొర ఇంటి వద్ద బైఠాయించిన గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రాజన్నదొరతో గిరిజనుల స్పష్టీకరణ



సాలూరు(విజయనగరం): తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వద్ద తెగేసి చెప్పారు. కొదమ నుంచి గిరిజనులు మంగళవారం ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌ 9న తమ పంచాయతీకి వచ్చినప్పుడు 70 రోజుల్లో పట్టుచెన్నారు- చింతచెట్టు జంక్షన్‌ నుంచి కొదమకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడు నెలలు దాటినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని... ఎప్పుడు నిర్మిస్తారన్నారని ప్రశ్నించారు. తమ గ్రామం పక్కన ఉన్న ఒడిశా గ్రామాలకు ఆ ప్రభుత్వం రోడ్లు వేసిందని తెలిపారు.


రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిశాలో కలిసిపోతామన్నారు. వారితో ఎమ్మెల్యే రాజన్నదొర చర్చలు జరిపారు. రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని, త్వరలోనే అనుమతి తీసుకుంటామని చెప్పారు. రోడ్డు నిర్మించి.. కొదమకు వస్తానని చెప్పారు. అప్పటికీ శాంతించని వారు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆయన ఇంటి వద్ద కాసేపు బైఠాయించారు. వారికి ఆయన మరోసారి సర్దిచెప్పడంతో శాంతించారు. కార్యక్రమంలో చోడిపల్లి మాలతీదొర, చంద్రయ్య, భీమ, వరుణ్‌, వసంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T05:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising