ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టపగలే చోరీ

ABN, First Publish Date - 2021-04-24T05:14:20+05:30

కిల్తంపాలెం పంచాయతీ కృష్ణమహంతిపురం గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నా యి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  8 తులాల బంగారం, రూ.10వేలు అపహరణ

శృంగవరపుకోట రూరల్‌: కిల్తంపాలెం పంచాయతీ కృష్ణమహంతిపురం గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం చోరీ  జరిగింది.  వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పట్రాన అరసవిల్లి కుటుంబ సభ్యులు ఉదయం 7గంటలలోపు ఉపాధి పనికి వెళ్లిపోయారు. అయితే ఉదయం 9గంటల సమయంలో ముగ్గురు యువకులు ఒకే బండిపై వచ్చి గ్రామంలో తిరిగారని, ఇదే సమయంలో తాళం వేసి ఉన్న అరసవిల్లి ఇంటిని గుర్తించి తాళం పగలగొట్టారని స్థానికులు తెలిపారు. ఇంట్లో వున్న బీరువాను తెరిచి 8 తులాల బంగారం, రూ.10వేలు, 10తులాల వెండిపట్టీలు అపహరించినట్టు చెప్పారు. ఇదే విషయంపై బాధితుడు మాట్లాడు తూ తన పెద్దకుమార్తె వేణు ఇంటి నిర్మాణం కోసం ఆమె నగలుతో పాటు తన చెల్లెలి బంగారు వస్తువులను తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకుందాం అనుకున్నా మని, ఇలోపే ఈ సంఘటన జరిగిందని వాపోయారు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని అరసవిల్లి భార్య రమణమ్మ, కూతుళ్లు వేణు, రాధిక, శ్రీలక్ష్మిలు విల పించారు. దీనిపై  పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2021-04-24T05:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising