‘మా భూమి మాకివ్వండి’
ABN, First Publish Date - 2021-03-02T05:48:41+05:30
కొవ్వాడ రెవెన్యూ పరిధిలోగల 17ఎకరాల భూమిని గతంలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడి అనుచరులు ఆక్రమించారని, ఆ భూములు తమకు తిరిగి అందజేయలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ విజయ్భాస్కర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
పూసపాటిరేగ: కొవ్వాడ రెవెన్యూ పరిధిలోగల 17ఎకరాల భూమిని గతంలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడి అనుచరులు ఆక్రమించారని, ఆ భూములు తమకు తిరిగి అందజేయలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ విజయ్భాస్కర్కు వినతిపత్రాన్ని అందజేశారు. సుమారు 45మంది దళితులకు సంబంధించిన డీపట్టా భూములను తీసుకొని అక్కడ ఒక పరిశ్రమ నిర్మించారని చెప్పారు. దీనిపై తగు చర్యలు తీసుకొని తమ భూములను తమకు అప్పగించాలని వీరు వినతిపత్రంలో కోరారు.
Updated Date - 2021-03-02T05:48:41+05:30 IST