రుణాల రికవరీపై దృష్టి
ABN, First Publish Date - 2021-07-25T05:10:25+05:30
జిల్లాలో అమలవుతున్న ఏపీ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకానికి సంబంధించి రైతులకు ఇచ్చిన రుణాల రికవరీపై క్షేత్ర స్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ కె.సునీల్రాజ్కుమార్ ఆదేశించారు.
డీఆర్డీఏ పీడీ కె.సునీల్రాజ్కుమార్
విజయనగరం (ఆంధ్రజ్యోతి) జూలై 24 : జిల్లాలో అమలవుతున్న ఏపీ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకానికి సంబంధించి రైతులకు ఇచ్చిన రుణాల రికవరీపై క్షేత్ర స్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ కె.సునీల్రాజ్కుమార్ ఆదేశించారు. శనివారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో రైతు ఉత ్పత్తి దారుల సంఘాలు, ఏపీఎం, సీసీలతో మాట్లాడారు. దత్తిరాజేరు, రామభద్రపురం, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లో ఐదు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, 922 చిన్న రైతు సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. మామిడి, కూరగాయలు, వరి, పశు సంపదకు సంబంధించిన రైతులకు గతంలో వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువుల కోసం సెర్ప్, బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలను త్వరితగతిన రికవరీ చేయాలన్నారు. వచ్చే నెలలో కొత్తగా 13 మండలాల్లో అమలు కానున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల పఽథకంపై చర్చించారు. అందుకు అవసరమైన విధి విధానాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏపీడీ సావిత్రి మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తి సంఘాలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంట బీమా పఽథకం వంటివి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సచివాలయ సిబ్బందితో సమస్వయం చేసుకోవాలని సూచించారు.
Updated Date - 2021-07-25T05:10:25+05:30 IST