ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం జరిగే వరకూ పోరాటం

ABN, First Publish Date - 2021-11-30T05:12:24+05:30

పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుదామని రైతు సంఘం జాతీయ నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు.

వేపాడ: రైతులతో ర్యాలీ చేస్తున్న జాతీయ నాయకుడు శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  రైతు సంఘ జాతీయ నాయకుడు శ్రీనివాసరావు  

  కాలువ నిర్మాణం కోసం పంట భూములు లాక్కోవడం తగదు

వేపాడ: పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుదామని రైతు సంఘం జాతీయ నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు. జాకేరు-కరకవలస గ్రామాల మధ్య కాలువ నిర్మా ణం కోసం గుర్తించిన పంట పొలాలను సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా రైతు సంఘ కార్యదర్శి చల్లా జగన్‌ ఆధ్వర్యంలో ఆయన సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల అనుమతి లేకుండా కాలువ నిర్మాణం కోసం పంట భూములు లాక్కోవడం తగదని, ఆ అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులపై కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులు కేసులు పెట్టడం కాదని రైతులే వారిపై కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. గ్రామసభలు పెట్టకుండా, కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణ ఎలా చేపడడతా రని ప్రశ్నించారు.  అధికారులు స్పందించి కొన్ని ప్రాంతాల్లో కాలువ డిజైన్‌లో మార్పులు చేపట్టి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. వేపాడ, వల్లంపూడి, దబ్బిరాజు పేట, కరకవలస, గుడివాడ, జాకే రు, వెంకటరమణపేట గ్రామాల రైతులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-11-30T05:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising