ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-03-03T04:32:04+05:30

మాంబ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆరో వారం జాతర ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలిరావడంతో చదురుగుడి, వనం గుడి పరిసరాలు కిటకిటలాడుతూ కనిపించాయి

క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




ఘనంగా ఆరో వారం జాతర

మక్కువ, మార్చి 2 : పోలమాంబ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆరో వారం జాతర ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలిరావడంతో చదురుగుడి, వనం గుడి పరిసరాలు కిటకిటలాడుతూ కనిపించాయి. వనం గుడి వేప చెట్టు వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గోముఖి నదీ తీరంలో పవిత్రస్నానాలు ఆచరించిన అనంతరం మొక్కుబడులు చెల్లించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమీప తోటల్లో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు.  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో బీఎల్‌ నగేష్‌ ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ కె.రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేయడంతో భక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కాలినడకన శంబర గ్రామానికి చేరుకున్నారు.





Updated Date - 2021-03-03T04:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising