అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2021-01-19T05:28:29+05:30
పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం, జనవరి 18: పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులతో పార్వతీపురంలో సమీక్ష నిర్వహించారు. సీతానగరం మండలంలో గెడ్డలుప్పి వంతెన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని, మరిపివలస నుంచి పార్వతీపురం వరకు బీటీ రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నామని, అదే విధంగా పార్వతీపురం నియో జకవర్గ పరిధిలో నూతనంగా మం జూరైన అభివృద్ధి పనులు గూర్చి ఆర్ అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రన్ వివరించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయిం చాల ని, కొత్త అభివృద్ధి పనులకు అవసర మైన ప్రతి పాదనలు పంపిస్తే నిధు లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
Updated Date - 2021-01-19T05:28:29+05:30 IST