ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురిటిపెంటలో డెంగ్యూ కలకలం

ABN, First Publish Date - 2021-05-13T05:10:38+05:30

పురిటిపెంటలో డెంగ్యూ కలకలం

ప్రధాన రహదారిపై సంచరిస్తున్న పందులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరిగిన పందుల సంచారం 

ఆందోళనలో గ్రామస్థులు

గజపతినగరం : మండలంలోని పురిటి పెంట న్యూకాలనీలో డెంగ్యూ కలకలం సృష్టిస్తుంది.  కొద్ది రోజులుగా జర్వంతో బాధపడుతున్న కొందరు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ అయిందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పందుల సంచారంతోనే ఈ వ్యాధి ప్రబలుతుందని స్థానికులు వాపోతున్నారు. గత నెలలో ఇదే కాలనీలో ఇద్దరికి డెంగ్యూ లక్షణా  లు కనిపించగా విశాఖలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం మరికొంత మందికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే మరో వైపు డెంగ్యూ ప్రబలుతుండడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందని,  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్య పనులతోపాటు పందుల సంచారాన్ని నివారించాలని కాలనీవాసులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-13T05:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising