ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవర ఉత్సవానికి చాటింపు

ABN, First Publish Date - 2021-05-18T05:11:57+05:30

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దేవర ఉత్సవానికి చాటింపు వేశారు. ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌, పురోహితులు, ఆలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడిమాంబ చదురుగుడి వద్ద ఈ చాటింపు ప్రక్రియ నిర్వహించారు. ఏటా వైశాఖమాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

చాటింపు వేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

24న నిర్వహణకు నిర్ణయం

విజయనగరం రూరల్‌, మే 17: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దేవర ఉత్సవానికి చాటింపు వేశారు. ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌, పురోహితులు, ఆలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడిమాంబ చదురుగుడి వద్ద ఈ చాటింపు ప్రక్రియ నిర్వహించారు. ఏటా వైశాఖమాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అక్టోబరు నెలలో జరిగే సిరిమానోత్సవానికి ఇది నాంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చదురుగుడిలోని పైడిమాంబకు ఆలయ ఈవో, అర్చకులు, ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిమాంబను వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. వివిధ పండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం 4 గంటల ప్రాంతంలో ఆలయం ఎదుట తలయారీ చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 24న దేవర ఉత్సవాన్ని కరోనా నిబంధనలు నడుమ నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. 


Updated Date - 2021-05-18T05:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising