ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధులున్నా రహదారి నిర్మించరేం..?

ABN, First Publish Date - 2021-04-12T05:19:28+05:30

నారింజపాడు రోడ్డు నిర్మాణానికిగాను రూ.4.96 కోట్లు నిధులున్నా ఇప్పటివరకు ఎందుకు నిర్మించడం లేదని కరడవలస, నారింజపాడు గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ధర్నా చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  గిరిజనుల ధర్నా

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 11: నారింజపాడు రోడ్డు నిర్మాణానికిగాను రూ.4.96 కోట్లు నిధులున్నా ఇప్పటివరకు ఎందుకు నిర్మించడం లేదని కరడవలస, నారింజపాడు గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ఆదివారం స్థానిక సీపీఎం నేత కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరడవలస సమీపంలో ధర్నా చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులున్నా గిరిజన ప్రాంతాల పట్ల చిన్నచూపుతో పనులు ప్రారంభించడం లేదని ఆరోపించారు. జిల్లేడువలసకు గత ప్రభుత్వ హయాంలోనే రూ.3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభించి, వదిలేశా రన్నారు. ఈ రెండు రోడ్లు తక్షణమే నిర్మించాలని గిరిజనులు కోరారు. ఈ కార్యక్ర మంలో సీదరపు అప్పారావు, సంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-04-12T05:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising