నేటి నుంచి కరోనాపై ప్రచారం
ABN, First Publish Date - 2021-03-24T05:48:48+05:30
కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సచివాలయ కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని నగర పంచాయతీ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు సూచించారు.
నెల్లిమర్ల, మార్చి 23: కరోనా రెండో దశ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సచివాలయ కార్యదర్శులు చురుగ్గా వ్యవహరించాలని నగర పంచాయతీ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు సూచించారు. నెల్లిమర్ల నగర పంచాయతీలోని 8 వార్డుల్లో పనిచేస్తున్న పరిపాలన కార్యదర్శులు, శానిటేషన్ కార్యదర్శులు, మహిళా కార్యదర్శులతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24వ తేదీ నుంచి 15 రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ త్రినాధనాయుడు, శానిటరీ ఇనస్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-24T05:48:48+05:30 IST