‘గౌరవ వేతనంపై కేబినెట్ నిర్ణయం సరికాదు’
ABN, First Publish Date - 2021-05-11T05:04:38+05:30
రిజిస్ట్రేషన్ ఉన్న చర్చిల్లోని పాస్టర్లకు మాత్రమే గౌరవ వేతనం ఇస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం సరికాదని నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ప్ కౌన్సిల్ ఏపీ ఉపాధ్యక్షుడు వైఎస్ చిన్నారావు తెలి పారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పాస్టర్లకు అన్యాయం జరగుతుందన్నారు.
చీపురుపల్లి: రిజిస్ట్రేషన్ ఉన్న చర్చిల్లోని పాస్టర్లకు మాత్రమే గౌరవ వేతనం ఇస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం సరికాదని నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ప్ కౌన్సిల్ ఏపీ ఉపాధ్యక్షుడు వైఎస్ చిన్నారావు తెలి పారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పాస్టర్లకు అన్యాయం జరగుతుందన్నారు. సోమవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు పాస్టర్లందరికీ గౌరవం వేతనం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు మాట మార్చడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. ఇదే నిబంధనలను తప్పని సరి చేయాల్సి వస్తే, ఆయా ప్రాంతాల్లో ఉన్న చర్చిలకు వెంటనే రిజిస్ట్రేషన్లు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాస్టర్లు సునీల్కుమార్, బి.ఎలీషా, ఎం.నటరాజ్, బి.గణేష్, ఎ.విశ్వాసి, జి.కృపారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-11T05:04:38+05:30 IST