ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసరాల ధరల పెంపు తగదు

ABN, First Publish Date - 2021-03-01T04:56:19+05:30

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని ఆప్‌ జిల్లా కన్వీనర్‌ కె.దయానంద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని సంతకాల వంతెన వద్ద ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఖాళీ గ్యాస్‌బండలతో వినూత్నంగా నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఫిబ్రవరి 28 : గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని ఆప్‌ జిల్లా కన్వీనర్‌ కె.దయానంద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని సంతకాల వంతెన వద్ద ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఖాళీ గ్యాస్‌బండలతో వినూత్నంగా నిరసన తెలిపారు.  ధరలు అమాంతం పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.  ప్రస్తుతం డీజిల్‌ , పెట్రోల్‌ ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయన్నారు.   కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో అధిక మొత్తం వసూలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.  మరోవైపు ఉల్లి, నూనె, పప్పు తదితర నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయన్నారు.  కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి పేదలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ధరలు పెంచడం భావ్యం కాదన్నారు. వెంటనే ధరలను అదుపు చేయకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆప్‌ ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, పి.సురేష్‌, లోవరాజు తదితరులు  పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-01T04:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising