నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ABN, First Publish Date - 2021-05-10T05:10:56+05:30
కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ మోహనరావు హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసీ కంప్లెక్స్ కూడలి వద్ద గస్తీ నిర్వహించారు.
సీతానగరం(బొబ్బిలి): కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ మోహనరావు హెచ్చరించారు. ఆదివారం ఆర్టీసీ కంప్లెక్స్ కూడలి వద్ద గస్తీ నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. అనవసరంగా బయట తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలిపారు. ఆయన వెంట రూరల్ సీఐ పి.శోభన్బాబు తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-05-10T05:10:56+05:30 IST